అధ్విక్ అలియాస్ రాజేష్ బెజ్జంకి, శ్రీధర్, సృజనక్షిత, పి. అన్షు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘పైసావాలా’. కె. నవీన్ తేజస్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఏఆర్ ఎంటర్టైన్మెంట్స్, ఫైవ్ ఎలిమెంట్స్ క్రియేషన్స్, , వీకేఎం మూవీస్ బ్యానర్లపై నూనెల పైడిరాజు, కె. నవీన్ తేజస్, పిజె దేవి నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన లవ్ సాంగ్ ‘ఏమైందిదో ..’కి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది.
తాజాగా ఈ చిత్రం నుంచి రెండో పాటను విశాఖపట్నంలోని సిద్ధార్థ డిగ్రీ కాలేజీలో విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి హీరో అధ్విక్, దర్శకుడు కె. నవీన్ తేజస్, నిర్మాతలు పైడిరాజు, పి.ఎస్.ఎన్. రాజు హాజరయ్యారు.
‘జీవుల మనుగడకు సృష్టించిన పైసా.. జీవం లేకున్నా నిర్జీవిరా పైసా’ అంటూ సాగే ఈ పాటకు నగేశ్ గౌరీష్ సంగీతం అందించగా, కాకి లక్ష్మణ్రెడ్డి ఆలపించారు. డబ్బుతో ఎలాంటి అవసరాలు ఉంటాయో తెలియజేసేలా ఈవీఆర్ & గురుబిల్లి జగదీష్ ఈ పాటను రచించారు. గౌతం వాయిలాడ సినిమాటోగ్రాఫర్గా, ఎంజే సూర్య ఎడిటర్గా వ్యవహరిస్తున్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.


