‘సింహా, జై సింహా, శ్రీ రామరాజ్యం’ వంటి చిత్రాల తర్వాత హీరో బాలకృష్ణ, హీరోయిన్ నయనతార మళ్లీ కలిసి నటించనున్నారు. ‘వీరసింహారెడ్డి’ వంటి హిట్ మూవీ తర్వాత బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ హిస్టారికల్ మూవీ రానుంది.
వెంకట సతీష్ కిలారు ఈ సినిమాను నిర్మించనున్నారు. నవంబరు 18న (బుధవారం) నయనతార బర్త్ డే. బాలకృష్ణ కెరీర్లోని ఈ 111వ చిత్రంలో ఆమె హీరోయిన్గా నటించనున్నట్లు మేకర్స్ వెల్లడించి, ఆమె రాణిగా కనిపించనున్నట్లు తెలిపారు.


