టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబు తనయుడికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. ఈ రోజు గౌతమ్ బర్త్ డే కావడంతో కుమారుడితో ఉన్న ఫోటోను షేర్ చేశారు. ఈ సందర్భంగా పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ ట్వీట్ చేశారు. నీ కలలను ఎల్లప్పుడూ ధైర్యంతో, దయతో నేరవేర్చుకోవాలని ఆకాంక్షించారు.
మహేశ్ బాబు తన ట్వీట్లో రాస్తూ..' ఘట్టమనేని గౌతమ్కు 20వ పుట్టినరోజు శుభాకాంక్షలు.ఈ కొత్త అధ్యాయంలోకి అడుగుపెడుతున్నప్పుడు నీ కలలను ఎల్లప్పుడూ ధైర్యంతో, దయతో నేరవేర్చుకోవాలని కోరుకుంటున్నా. ప్రతి రోజు నిన్ను చూసి గర్వపడుతున్నా' అంటూ రాసుకొచ్చారు. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు సైతం గౌతమ్కు బర్త్ డే విషెస్ చెబుతూ పోస్టులు పెడుతున్నారు.
ఇక మహేశ్ బాబు సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం వారణాసి మూవీతో బిజీగా ఉన్నారు. ఈ చిత్రానికి దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా హీరోయిన్గా కనిపించనుంది. ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Happy 20 GG!! As you step into this new chapter, may you always chase your dreams with courage and kindness….. Proud of you today and every day….♥️♥️♥️ pic.twitter.com/kn8AGpviWY
— Mahesh Babu (@urstrulyMahesh) August 31, 2026


