Sarkaru Vari Pata Trailer: 'సర్కారు వారి పాట' ట్రైలర్​.. ఆకట్టుకుంటున్న మహేశ్​ మాస్​ డైలాగ్స్​

Mahesh Babu Mass Dialogues In Sarkaru Vari Pata Movie - Sakshi

Mahesh Babu Mass Dialogues In Sarkaru Vari Pata Movie: సూపర్​ స్టార్ మహేశ్ బాబు ఫ్యాన్స్​ ఎంతగానో ఎదురుచూస్తున్న సర్కారు వారి పాట మూవీ ట్రైలర్​ రానే వచ్చింది. పరశురామ్​ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మహేశ్ బాబు సరసన హీరోయిన్​గా కీర్తి సురేష్​ నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ మే 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో సోమవారం ట్రైలర్​ను విడుదల చేశారు. ఈ సినిమా ట్రైలర్​లో మహేశ్ బాబు లుక్స్​, డైలాగ్​లు, డైలాగ్ డెలివరీ అభిమానులనే కాదు ప్రేక్షకులను సైతం విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. 

ముఖ్యంగా ట్రైలర్​లో మహేశ్​ చెప్పిన డైలాగ్​లు బాగా పేలాయి. 'నువ్​ నా ప్రేమను, స్నేహాన్ని దొంగలించగలవు కానీ నా డబ్బును దొంగలించలేవ్', 'నేను విన్నాను.. నేను ఉన్నాను', 'వంద వయగ్రాలు వేసి శోభనానికి ఎదురుచూస్తున్న పెళ్లి కొడుకు గదికి వచ్చినట్లు వచ్చార్రా', 'దిస్ ఈజ్​ మహేశ్​ రిపోర్టింగ్​ ఫ్రమ్​ చేపలుప్పాడ బీచ్ సర్'​ వంటి తదితర డైలాగ్​లు ఓ రేంజ్​లో ఉన్నాయి. ప్రజా సంకల్ప పాదయాత్రలో భాగంగా ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్​మోహన్‌రెడ్డి చెప్పిన 'నేను విన్నాను.. నేను ఉన్నాను' అనే మాటలను.. కూడా  ఈ మూవీలో వాడారు. ​
చదవండి: విశ్వక్​ సేన్​-టీవీ యాంకర్​ వీడియోపై ఆర్జీవీ షాకింగ్​ కామెంట్స్​..

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top