Late Actor Akkineni Nageswara Rao Pratibimbalu Movie Re Release In 250 Theatres - Sakshi
Sakshi News home page

Akkineni Nageswara Rao: 250 థియేటర్లో రీ రిలీజ్‌కు రెడీ అవుతున్న అక్కినేని ‘ప్రతిబింబాలు’

Nov 1 2022 8:48 AM | Updated on Nov 1 2022 11:17 AM

Late Actor Akkineni Nageswara Rao Pratibimbalu Re release in 250 Thatres - Sakshi

దివంగత నటులు అక్కినేని నాగేశ్వరరావు హీరోగా నటించిన ‘ప్రతిబింబాలు’(1982) చిత్రం 40 ఏళ్ల తర్వాత ప్రేక్షకుల ముందుకు వస్తోంది. సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో జయసుధ హీరోయిన్‌గా నటించారు. విష్ణుప్రియ సినీకంబైన్స్‌ బేనర్‌పై సీనియర్‌ నిర్మాత జాగర్లమూడి రాధాకృష్ణ నిర్మించిన ఈ చిత్రాన్ని ఈ నెల 5న విడుదల చేయనున్నట్లు చిత్రయూనిట్‌ ప్రకటించింది.

చదవండి: సిద్దార్థ్‌, అదితిల సీక్రెట్‌ డేటింగ్‌? వైరల్‌గా హీరో పోస్ట్‌

ఈ సందర్భంగా జాగర్లమూడి రాధాకృష్ణ మాట్లాడుతూ.. ‘‘ప్రతిబింబాలు’ సినిమాని అనేక కారణాల వల్ల అప్పట్లో విడుదల చేయలేకపోయాను. కానీ, ప్రస్తుతం ఉన్న అధునాతన టెక్నాలజీని జోడించి, సరికొత్త హంగులతో రిలీజ్‌ చేస్తున్నందుకు సంతోషంగా ఉంది. నా గత సక్సెస్‌ఫుల్‌ చిత్రాల కోవలోనే ‘ప్రతిబింబాలు’ కూడా నిలుస్తుందనే నమ్మకం ఉంది’’ అన్నారు. ‘‘ప్రతిబింబాలు’ చిత్రాన్ని మా వాణి వెంకటరమణ సినిమాస్‌ డిస్ట్రిబ్యూషన్‌ సంస్థ ద్వారా 250 థియేటర్లలో విడుదల చేస్తున్నందుకు గర్వంగా ఉంది’’ అన్నారు నిర్మాత కాకర్లమూడి రవీంద్ర కల్యాణ్‌. ఈ చిత్రానికి సమర్పణ: రాజేశ్వరన్‌ రాచర్ల, నిర్వహణ: జాగర్లమూడి సురేశ్‌ బాబు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement