Kareena Kapoor : హీరోయిన్‌గా నటిస్తూనే, నిర్మాణ రంగంలోకి..

Kareena Kapoor Turns As Producer For Hansal Mehta-Ekta Kapoor Project - Sakshi

బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ కరీనా కపూర్‌ ఓ వైపు హీరోయిన్‌గా నటిస్తూనే మరోవైపు నిర్మాతగా ఎంట్రీ ఇస్తున్నారు. ఈ సినిమాకు 'స్కామ్ 1992' వెబ్ సిరీస్‌తో పాపులర్‌ అయిన హన్సల్ మెహతా దర్శకత్వం వహించనున్నారు. వాస్తవ సంఘటనల ఆధారంగా థ్రిల్లర్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ చిత్రాన్నితెరకెక్కిస్తున్నారు.

ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన కరీనా..'హన్సల్‌ మెహతా చిత్రాలంటే నాకు చాలా ఇష్టం. ఆయనతో కలిసి పనిచేయడం సంతోషంగా ఉంది' అని పేర్కొన్నారు. ఏక్తా కపూర్‌ సహా నిర్మాతగా వ్యవహరించనున్నారు. యూకేలో షూటింగ్‌ జరగనున్న ఈ ప్రాజెక్టుకి సంబంధించి మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి. ప్రస్తుతం కరీనా అమిర్‌ఖాన్‌తో కలిసి ‘లాల్‌ సింగ్‌ ఛద్దా’ చిత్రంలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top