
ఓటీటీలోకి ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు వస్తూనే ఉంటాయి. కొన్నిసార్లు డబ్బింగ్ చిత్రాలు నేరుగా తెలుగు స్ట్రీమింగ్ అయిపోతుంటాయి. ఇప్పుడు అలానే ఓ తమిళ కామెడీ థ్రిల్లర్ ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ఈ మేరకు తేదీని అధికారికంగా ప్రకటించారు. ఇంతకీ ఏంటా మూవీ? ఎందులో స్ట్రీమింగ్ కానుంది?
కొరియోగ్రాఫర్ గా మనకు తెలిసిన ప్రభుదేవా.. గత కొన్నాళ్ల నుంచి పూర్తిస్థాయి నటుడిగా మారిపోయాడు. హీరో, సహాయ పాత్రల్లో నటిస్తున్నాడు. ఇతడు హీరోగా నటించిన మూవీ 'జాలీ ఓ జింఖానా'. గతేడాది నవంబరులో తమిళంలో థియేటర్లలో రిలీజైంది. ఇప్పుడు తెలుగు వెర్షన్ ని నేరుగా ఓటీటీలో రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు.
(ఇదీ చదవండి: కొత్తింట్లోకి అడుగుపెట్టిన అనసూయ.. ఇంటికి పేరు కూడా)
నేటి(మే 15) నుంచి ఆహా ఓటీటీలో ఈ కామెడీ థ్రిల్లర్ మూవీ స్ట్రీమింగ్ కానుంది. శవం బ్యాక్ డ్రాప్ కథతో తీసిన ఈ చిత్రం తమిళంలో జనాల్ని ఆకట్టుకోలేకపోయింది. దీంతో ఇప్పుడు తెలుగు వెర్షన్ ని నేరుగా ఓటీటీలో రిలీజ్ చేస్తున్నట్లు అనిపిస్తుంది.
'జాలీ ఓ జింఖానా' విషయానికొస్తే.. తంగసామి అనే వ్యక్తి కొందరు మహిళలతో కలిసి హోటల్ నడుపుతుంటాడు. అనుకోకుండా ఆ ప్రాంత ఎమ్మెల్యేతో వీళ్లకు గొడవ అవుతుంది. దీని తర్వాత మరో సమస్య వస్తుంది. దీన్ని నుంచి గట్టెక్కిస్తాడని ఓ లాయర్ దగ్గరకు వీళ్లంతా వెళ్తారు. అతడికి కలవడానికి వెళ్లేసరికి అతడు శవమై కనిపిస్తాడు. ఇంతకీ ఎలా చనిపోయాడు? బతికున్నాడని కవర్ చేయడానికి ఎలాంటి పాట్లు పడ్డారనేదే స్టోరీ.
(ఇదీ చదవండి: సడన్ గా ఓటీటీలోకి వచ్చేసిన 'అర్జున్ సన్నాఫ్ వైజయంతి' సినిమా)
They packed bags, snacks… and a dead body? 🚗💀
Discover the most unexpected family journey in #JollyOGymkhana on aha!
Watch #jollyogymkhana from May 15 on #aha#prabhudeva #Pujithaponnada #yogibabu #MadonnaSebastian pic.twitter.com/LGhsS1qCCW— ahavideoin (@ahavideoIN) May 13, 2025