‘ఉత్సవం' మనందరం గర్వపడే సినిమా | Hero Dileep Prakash Talks About Utsavam Movie | Sakshi
Sakshi News home page

‘ఉత్సవం' మనందరం గర్వపడే సినిమా

Sep 10 2024 7:09 AM | Updated on Sep 10 2024 8:32 AM

Hero Dileep Prakash Talks About Utsavam Movie

‘‘కన్నడలో ‘క్రేజీ బాయ్‌’ సినిమా చేశాను. తెలుగులో నా తొలి చిత్రం ‘ఉత్సవం’. సురభి నాటక సమాజం స్ఫూర్తితో రంగస్థల కళాకారులపై తీసిన సినిమా ఇది. చాలా మంచి కథ. ఈ చిత్రానికి కథే హీరో’’ అని దిలీప్‌ ప్రకాష్‌ అన్నారు. 

అర్జున్‌  సాయి దర్శకత్వంలో దిలీప్‌ ప్రకాష్, రెజీనా కసాండ్ర లీడ్‌ రోల్స్‌లో నటించిన చిత్రం ‘ఉత్సవం’. హార్న్‌బిల్‌ పిక్చర్స్‌పై సురేష్‌ పాటిల్‌ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 13న రిలీజ్‌ కానుంది. దిలీప్‌ ప్రకాష్‌ మాట్లాడుతూ– ‘‘సినిమాలు పుట్టిందే నాటకాల నుంచి. ఈ విషయాన్నే ‘ఉత్సవం’లో చూపిస్తున్నాం. ఈ మూవీలో తెలుగు సంస్కృతి, సంప్రదాయాలు కనిపిస్తాయి. సందేశంలా కాకుండా వినోదాత్మకంగా చెబు తున్నాం. మనందరం గర్వపడే సినిమా ఇది. రెజీనాగారు మంచి కోస్టార్‌. నా తర్వాతి చిత్రం తెలుగులోనే ఉంటుంది’’ అన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement