Anushka Sharma: ఖరీదైన వాచ్‌ పెట్టావ్‌‌; మాస్క్‌ మాత్రం మరిచిపోయావ్

Fans Trolls Anushka Sharma Wrist Watch Worth Rs 50 Lakh Not Wearing Mask - Sakshi

లండన్‌: ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌ నేపథ్యంలో టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి- బాలీవుడ్ నటి అనుష్క శర్మ దంపతులు ప్రస్తుతం ఇంగ్లండ్‌లో ఉన్న విషయం తెలిసిందే. కూతురు వామికాతో కలిసి పలు పర్యాటక ప్రాంతాలు సందర్శిస్తూ ఎంజాయ్‌ చేస్తున్నారు. ఈ క్రమంలో తమకు సంబంధించిన అప్‌డేట్స్‌ను అనుష్క సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తూ ఉన్నారు. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో అనుష్క తన సెల్ఫీని షేర్ చేసింది.

ఆ ఫోటోలో తన స్టైలిష్‌ హెయిర్ కట్‌తో బ్లాక్‌ అండ్‌ వైట్‌ టాప్‌ ధరించడంతో పాటు చేతికి ఖరీదైన వాచ్‌ను ధరించి నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది. అయితే ఆమె ధరించిన వాచ్‌ ధర తెలిస్తే నోరువెళ్లబెట్టాల్సిందే. ఎందుకంటే ఆమె పెట్టుకున్న రోలెక్స్ కాస్మోగ్రాఫ్ డేటోనా రోజ్ డయల్ 18 కే ధర 65,879 డాలర్లు (అంటే మన కరెన్సీలో దాదాపు రూ. 50లక్షలు).

ప్రస్తుతం ఈ ఫోటో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే ఆమె పెట్టుకున్న ఖరీదైన వాచ్‌ గురించి అభిమానులు మాట్లాడుకుంటునే ట్రోల్‌ చేశారు. ''ఖరీదైన వాచ్‌ ధరించావు బాగానే ఉంది.. మాస్క్‌ మాత్రం మరిచిపోయావు'' అంటూ ట్రోల్‌ చేశారు. కాగా మంగళవారం (జులై 13న) వారి కుమార్తె వామికా 6వ నెలకు అడుగుపెట్టడంతో ఒక పార్క్‌లో వేడుకలను ఘనంగా నిర్వహించారు.

ఇక అనుష్క చివరి సారిగా 2018లో జీరో సినిమాలో నటించింది. ఇందులో షారుఖ్ ఖాన్, కత్రినా కైఫ్ కూడా నటించారు. ఆ తరువాత నిర్మాతగా మారిన అనుష్క శర్మ పలు వెబ్ సిరీస్‌లను నిర్మించి, ఓటీటీలో విడుదల చేసింది. ఇందులో పటల్ లోక్, బుల్బుల్ సిరీస్‌లు బాగా ఆకట్టుకున్నాయి. ప్రస్తుతం ఖాలా అనే వెబ్ సిరీస్‌ను నిర్మిస్తోంది. కాగా టీమిండియా, ఇంగ్లండ్‌ల మధ్య ఐదు టెస్టుల సిరీస్‌ ఆగస్టు 4 నుంచి ప్రారంభం కానుంది.
 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top