సుమన్, సాయికుమార్, వరుణ్ సందేశ్, వితికా షేరు ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘ధర్మస్థల నియోజకవర్గం’. జై జ్ఞాన ప్రభ తోట దర్శకత్వం వహించారు. మేరుం భాస్కర్ నిర్మాత. పొలిటికల్ ఎంటర్టైనర్ కథతో తీశారు. సెప్టెంబర్ 4న థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే తాజాగా ట్రైలర్ వదిలారు. హైదరాబాద్లో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఘనంగా నిర్వహించారు.
హీరోయిన్ వితికా షేరు మాట్లాడుతూ.. ఈ చిత్రంలోని పాటలు విన్న తర్వాతే కథ విన్నాను. పాటలు, కథ బాగా నచ్చి ఈ సినిమా చేసేందుకు ముందుకొచ్చాను. సినిమాలకు గ్యాప్ ఇచ్చాను కానీ ఇందులో డిఫరెంట్ క్యారెక్టర్ వచ్చింది కాబట్టే ఒప్పుకున్నాను అని చెప్పింది.


