
మాజీ భార్యాభర్తలు మళ్లీ కలిశారు. కోలీవుడ్ స్టార్ కపుల్ ధనుష్- ఐశ్వర్య రజనీకాంత్ జంటగా విడిపోయినా తల్లిదండ్రులుగా మాత్రం బాధ్యతగా ప్రవర్తిస్తున్నారు. తాజాగా తమ కుమారుడు యాత్ర గ్రాడ్యుయేషన్ వేడుకలకు వీరిద్దరూ హాజరయ్యారు. అతడిని మనసారా హత్తుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను ధనుష్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. యాత్ర తల్లిదండ్రులుగా గర్వంగా ఉందని క్యాప్షన్ ఇచ్చాడు. అటు రజనీకాంత్ సైతం అదే ఫోటోను ఎక్స్ (ట్విటర్)లో షేర్ చేస్తూ నా మనవడు తొలి మైలురాయిని దాటాడు. కంగ్రాట్స్ యాత్ర కన్నా.. అని రాసుకొచ్చాడు.
20 ఏళ్లకు విడాకులు
సూపర్స్టార్ రజనీకాంత్ కూతురు ఐశ్వర్యను హీరో ధనుష్ 2004లో పెళ్లి చేసుకున్నాడు. వీరికి యాత్ర, లింగ అని ఇద్దరు కుమారులు సంతానం. ఎంతో ఆదర్శవంతంగా ఉండే ఈ జంట 2022లో విడిపోతున్నట్లు ప్రకటించింది. అప్పటి నుంచి వీరు వేర్వేరుగానే జీవిస్తున్నారు. భార్యాభర్తలన్నాక చిన్నపాటి గొడవలు మామూలే, మళ్లీ కలిసిపోతారులే అనుకున్న అభిమానులకు షాకిస్తూ విడాకులు కావాలంటూ కోర్టుకెక్కారు.
రజనీకాంత్ రంగంలోకి దిగినా ప్రయోజనం లేకపోయింది. చివరకు చెన్నై కుటుంబ సంక్షేమ కోర్టు వీరికి గతేడాది నవంబర్లో విడాకులు మంజూరు చేసింది. సినిమాల విషయానికి వస్తే ధనుష్.. కుబేర, ఇడ్లీ కడై సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇందులో ఇడ్లీ కడై సినిమాలో నటించడంతో పాటు దర్శకుడిగా, నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు.
First milestone crossed my lovable grandson 💐 congratulations yathra kanna ! ❤️❤️ pic.twitter.com/D15JexNw4g
— Rajinikanth (@rajinikanth) May 31, 2025
చదవండి: ఈజీగా టచ్ చేయడానికి మేం ఆట బొమ్మలమా? : నిత్యామీనన్ ఫైర్