రికార్డ్‌ స్థాయిలో 'కమిటీ కుర్రోళ్ళు' క‌లెక్ష‌న్స్‌ | Committee Kurrollu Movie 3 Days Collections | Sakshi
Sakshi News home page

రికార్డ్‌ స్థాయిలో 'కమిటీ కుర్రోళ్ళు' క‌లెక్ష‌న్స్‌

Aug 12 2024 6:24 PM | Updated on Aug 12 2024 7:00 PM

 Committee Kurrollu Movie 3 Days Collections

నిహారిక కొణిదెల సమర్పణలో ఎల్‌.ఎల్‌.పి, శ్రీరాధా దామోదర్‌ స్టూడియోస్‌ బ్యానర్స్‌పై రూపొందిన చిత్రం ‘కమిటీ కుర్రోళ్ళు’. యదు వంశీ దర్శకత్వంలో పద్మజ కొణిదెల, జయలక్ష్మి అడపాక నిర్మించిన ఈ చిత్రం ఆగష్టు 9న విడుదలైంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని వంశీ నందిపాటి రిలీజ్‌ చేశారు. డిఫరెంట్ కంటెంట్‌తో ఇటు ఫ్యామిలీ ఆడియెన్స్‌, అటు యూత్‌ను ఆక‌ట్టుకున్న ఈ చిత్రం సూప‌ర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. అలాగే బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లను రాబట్టుకుంటోంది. 

మూడు రోజుల్లోనే ఈ మూవీ రూ. 6.04 కోట్లు వ‌సూళ్ల‌తో సంద‌డి చేస్తోంది. రోజు రోజుకీ సినిమాకు పాజిటివ్ టాక్ వ‌స్తుండ‌టంతో. క‌లెక్ష‌న్స్ విష‌యంలో ఇక‌పై ఇదే జోరుని కొన‌సాగిస్తుంద‌ని అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. మంచి ప‌ల్లెటూరి వాతావ‌ర‌ణంలో స్నేహం, ప్రేమ‌, కుటుంబంలోని భావోద్వేగాల‌ను ‘కమిటీ కుర్రోళ్ళు’ చిత్రంలో సీనియ‌ర్ న‌టీన‌టుల‌తో పాటు 11 మంది హీరోలు, న‌లుగురు హీరోయిన్స్‌ను తెలుగు సినిమాకు ప‌రిచ‌యం చేస్తూ మేక‌ర్స్ చేసిన ఈ ప్ర‌య‌త్నాన్ని అభినందిస్తూ ప్రేక్ష‌కులు సినిమాను ఆద‌రించార‌ని ట్రేడ్ వ‌ర్గాలంటున్నాయి. సినీ ప్రేక్ష‌కుల‌తో పాటు సెల‌బ్రిటీలు సైతం క‌మిటీ కుర్రోళ్ళు చిత్రాన్ని ప్ర‌శంసిస్తున్నారు.

‘కమిటీ కుర్రోళ్ళు’ కథేంటంటే..
గోదావరి జిలాల్లోని పురుషోత్తంపల్లె అనే గ్రామంలో జరిగే కథ ఇది. ఆ గ్రామంలో 12 ఏళ్లకు ఒక్కసారి భరింకాళమ్మతల్లి జాతర జరుగుతుంది. అయితే ఈ సారి ఊరి సర్పంచ్‌ ఎన్నికలకు పది రోజుల ముందు ఈ జాతర జరగాల్సి ఉంటుంది. ఈసారి ఎన్నికల్లో ఆ ఊరికి చెందిన యువకుడు శివ(సందీప్‌ సరోజ్‌).. ప్రస్తుత సర్పంచ్‌ పోలిశెట్టి బుజ్జి (సాయి కుమార్‌)పై పోటీకి నిలడేందుకు ముందుకు వస్తాడు.

గత జాతర సమయంలో ‘కమిటీ కుర్రోళ్లు’(11 మంది) కారణంగా ఊర్లో జరిగిన గొడవలను దృష్టిలో పెట్టుకొని, ఈ సారి జాతర జరిగేంతవరకు ఎన్నికల ప్రచారం చేయ్యొద్దని ఊరి పెద్దలు నిర్ణయం తీసుకుంటారు. ఆ తర్వాత ఏం జరిగింది?. 12 ఏళ్ల క్రితం ఊర్లో జరిగిన గొడవ ఏంటి? కమిటీ కుర్రోళ్లలో ఒకడైన ఆత్రం అలియాస్‌ నరసింహా ఎలా చనిపోయాడు? ఈ సారి జాతర ఎలా జరిగింది? విడిపోయిన కమిటీ కుర్రోళ్లు మళ్లి ఎలా కలిశారు? చివరకు ఎన్నికల్లో ఎవరు గెలిచారు? అనేదే మిగతా కథ.
 

Advertisement
 
Advertisement
Advertisement