
పహల్గాం దాడికి 'ఆపరేషన్ సింధూర్' పేరుతో భారత్ దీటైన సమాధానం ఇచ్చింది. మంగళవారం అర్ధరాత్రి పాకిస్థాన్ 9 ఉగ్ర స్థావరాలపై భారత సైన్యం మెరుపు దాడులు చేసింది. దీంతో సుమారు 80మందికి పైగా ఉగ్రవాదులు మరణించినట్లు తెలుస్తోంది. ఆపై కశ్మీర్లో ఉగ్రవాదానికి కారణమైన లష్కరే తొయిబా, జైషే మహమ్మద్, హిజ్బుల్ ముజాహిద్దీన్ సంస్థలకు చెందిన కీలకమైన క్యాంప్లను భారత్ నేలమట్టం చేసింది. ఇలాంటి సమయంలో భారత ఆర్మీ వెంట తామందరం ఉన్నామంటూ పలువురు ప్రముఖులు పోస్ట్లు పెడుతున్నారు. ‘ఆపరేషన్ సిందూర్’ అంటూ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.
జై హింద్.. ఆపరేషన్ సింధూర్ - చిరంజీవి
మా ప్రార్థనలు మా ఆర్మీతోనే ఉంటాయి.. ఒకే దేశం...కలిసి నిలబడతాము -ఆనంద్ మహీంద్రా
'ఆపరేషన్ సిందూర్'లో భాగమైన మన భారత సైన్యం భద్రత, బలం కోసం ప్రార్థిస్తున్నాను.. జైహింద్ -ఎన్టీఆర్
జై హింద్.. భారత్ మాతాకీ జై.. - రితేశ్ దేశ్ముఖ్
న్యాయం జరగాలి.. జై హింద్.. 'ఆపరేషన్ సిందూర్'- అల్లు అర్జున్
మన నిజమైన హీరోలకు సెల్యూట్..! దేశం ఆపదలో ఉంటే ఇండియన్ ఆర్మీ స్పందన ఎలా ఉంటుందో ఆపరేషన్ సిందూర్తో మరోసారి నిరూపించబడింద మీరు దేశాన్ని గర్వపడేలా చేస్తున్నారు. జై హింద్!- మోహన్లాల్
భారత సైన్యం భద్రతా కార్యకలాపాలకు రాయల్ సెల్యూట్ - విజయ్ దళపతి
ధర్మో రక్షతి రక్షితః.. జైహింద్ కి సేనా - వీరేంద్ర సెహ్వాగ్
భారత్ మాతా కీ జై.. సరైన న్యాయం జరిగింది - ఖుష్బూ