ఓటీటీలో 'రాజ్‌ తరుణ్‌' సినిమా.. ఈ ఏడాది ఫస్ట్‌ సినిమా ఇదే | Paanch Minar Movie now streaming this OTT | Sakshi
Sakshi News home page

ఓటీటీలో 'రాజ్‌ తరుణ్‌' సినిమా.. ఈ ఏడాది ఫస్ట్‌ సినిమా ఇదే

Jan 1 2026 2:46 PM | Updated on Jan 1 2026 2:56 PM

Paanch Minar Movie now streaming this OTT

రాజ్‌ తరుణ్‌  నటించిన 'పాంచ్‌మినార్‌' సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. ఈ క్రైమ్‌ కామెడీ థ్రిల్లర్‌ నవంబర్‌ 21న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే, ఇప్పటికే అమెజాన్‌ ప్రైమ్‌లో స్ట్రీమింగ్‌ అవుతుంది. కానీ, తాజాగా మరో ఓటీటీలోకి ఈ మూవీ వచ్చేసింది. రామ్‌ కడుముల దర్శకత్వం వహించిన ఈ మూవీలో రాశీ సింగ్‌ హీరోయిన్‌ కాగా బ్రహ్మాజీ, శ్రీనివాస్‌ రెడ్డి ముఖ్య పాత్రలు పోషించారు.

జనవరి 1 నుంచి ఆహా తెలుగు ఓటీటీలో పాంచ్‌ మినార్‌ చిత్రం స్ట్రీమింగ్‌ అవుతుంది. థియేటర్‌లో పెద్దగా ప్రేక్షకులను  ఈ మూవీ మెప్పించలేకపోయింది. దీంతో కేవలం వారానికే అమెజాన్‌ ప్రైమ్‌లో మొదటగా స్ట్రీమింగ్‌కు వచ్చేసిన విషయం తెలిసిందే.. గోవిందరాజు సమర్పణలో మాధవి, ఎంఎస్‌ఎం రెడ్డి ఈ మూవీని నిర్మించారు. ఆహాలో ఈ ఏడాది ఫస్ట్‌ సినిమా ఇదే కావడం విశేషం.

కథేంటి..?
కిట్టు (రాజ్‌ తరుణ్‌) నిరుద్యోగి. ఉద్యోగం సంపాదించే క్రమంలో ఈజీగా డబ్బులు సంపాదించాలనుకుంటాడు. బిట్‌కాయిన్‌ స్కామ్‌ ఐదు లక్షలు పోగొట్టుకుంటాడు. ఆ నష్టాన్ని పూడ్చుకునేందుకు క్యాబ్‌ డ్రైవర్‌గా మారతాడు. ఒకసారి ఇద్దరు హంతకులు కిట్టు క్యాబ్‌ బుక్‌ చేసుకుని అతడి ముందే ఓ హత్య చేస్తారు. వాళ్ల ముందు చెవిటివాడిగా నటించి తప్పుకున్న కిట్టు తర్వాత ఏం చేశాడు? అదేరోజు కిట్టుకు కోట్ల రూపాయల డబ్బు ఎలా వచ్చింది? దాంతో ఏం చేశాడు? అన్నది ఓటీటీలో చూడాల్సిందే!
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement