
‘ది కశ్మీర్ ఫైల్స్’(2022) సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు సొంతం చేసుకున్నారు దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి(Vivek Agnihotri). ఈ సినిమా తర్వాత ఆయన తెరకెక్కిస్తున్న చిత్రం 'బెంగాల్ ఫైల్స్'.. ఈ మూవీ నుంచి ఇప్పటికే విడుదలైన టీజర్, పోస్టర్లు అందరినీ ఆకర్షించాయి. ఈ క్రమంలోనే తాజాగా ట్రైలర్ను విడుదల చేశారు. ఇందులో మిథున్ చక్రవర్తి, అనుపమ్ ఖేర్, పల్లవి జోషి, దర్శన్ కుమార్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. గతంలో బెంగాల్లో ప్రజలు ఎదుర్కొన్న సమస్యలను దేశ ప్రజలకు చూపించేలా ఈ చిత్ర కథనం ఉంటుంది. సెప్టెంబర్ 5న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ విడుదల కానుంది.