Itlu Maredumilli Prajaneekam: Allari Naresh's film locks a new Release Date
Sakshi News home page

Allari Naresh : 'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం'.. కొత్త రిలీజ్‌ డేట్‌ వచ్చేసింది

Nov 5 2022 4:48 PM | Updated on Nov 5 2022 5:00 PM

Allari Naresh Itlu Maredumilli Prajaneekam Locks New Release Date - Sakshi

అల్లరి నరేశ్, ఆనంది జంటగా తెరకెక్కుతున్న చిత్రం 'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం'. ఈ చిత్రానికి ఏఆర్ మోహన్ దర్శకత్వం వహిస్తున్నారు. హాస్య మూవీస్ పతాకంపై రాజేశ్ దండు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అల్లరి నరేష్‌ కెరీర్‌లో 59వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్‌ ఇప్పటికే పూర్తయ్యింది. ఈనెల 11న ఈ సినిమా రిలీజ్‌ చేయాల్సి ఉండగా ఇప్పుడు విడుదల తేదీని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.

నవంబర్‌ 25న ఈ సినిమాను రిలీజ్‌ చేస్తున్నట్లు అనౌన్స్‌ చేశారు. దీనికి సంబంధించిన పోస్టర్‌ను అల్లరి నరేష్‌ షేర్‌ చేశారు. ఎన్నికల నిర్వహణకు ఓ మారుమూల పల్లెలో గిరిజన ప్రజలు నివసించే మారేడుమిల్లి గ్రామానికి వెళ్లే అధికారి పాత్రలో 'అల్లరి' నరేష్ నటించారు. వెన్నల కిషోర్‌, ప్రవీణ్‌ ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement