తిరుగులేదని నిరూపించుకున్న ‘ఖిలాడీ’! | Akshay Kumar Placed No 1 In Mood of the Nation Poll 2020 | Sakshi
Sakshi News home page

మళ్లీ అతడే నంబర్‌ 1!

Aug 8 2020 1:08 PM | Updated on Aug 8 2020 1:15 PM

Akshay Kumar Placed No 1 In Mood of the Nation Poll 2020 - Sakshi

బాలీవుడ్‌ ఖిలాడీ అక్షయ్‌ కుమార్‌ మరోసారి ఇండియా నెంబర్‌ 1 హీరోగా నిలిచాడు. బిగ్‌ బీ అమితాబ్‌ బచ్చన్‌ను వెనక్కి నెట్టి 24 శాతం ఓట్లతో అగ్రస్థానం సొంతం చేసుకున్నాడు. ఇండియా టుడే నిర్వహించిన ‘మూడ్‌ ఆఫ్‌ ది నేషన్‌’ సర్వేలో తనకు తిరుగులేదని నిరూపించుకున్నాడు. కాగా సామాజిక సందేశం కలిగిన సినిమాల్లో నటించడంతో పాటు సమాజ సేవలోనూ అక్కీ తన వంతు పాత్ర పోషిస్తాడన్న సంగతి తెలిసిందే.

గతంలో ఎంతో మందికి సాయం చేసి పెద్ద మనసు చాటుకున్న అక్షయ్‌.. ప్రాణాంతక కరోనా వైరస్‌పై పోరులో భాగంగా తొలుత రూ. 25 కోట్లు(పీఎం కేర్స్‌), ఆ తర్వాత మరో మూడు కోట్ల విరాళం అందజేశాడు. ప్రస్తుతం అతడు ‘బెల్‌ బాటమ్‌’, ‘రక్షా బంధన్‌’ తదితర సినిమాల్లో నటిస్తున్నాడు. ఇక ఈ జాబితాలో ఖాన్‌ల త్రయానికి టాప్‌-5లో చోటు దక్కింది.(ఇండియా నంబర్‌ 1 హీరోయిన్‌ ఎవరంటే!)

టాప్‌- 10 జాబితాలో చోటు దక్కించుకున్న హీరోలు
1. అక్షయ్‌ కుమార్‌-24 శాతం
2. అమితాబ్‌ బచ్చన్‌- 23
3. షారుఖ్‌ ఖాన్‌- 11
4. సల్మాన్‌ ఖాన్‌- 10
5. ఆమిర్‌ ఖాన్‌-6
6. ఇతరులు- 6 శాతం
7. అజయ్‌ దేవ్‌గణ్‌-4
8. హృతిక్‌ రోషన్‌-4
9. రణ్‌వీర్‌ సింగ్‌-4
10. రణ్‌బీర్‌ కపూర్‌-2

కాగా ఈ ఫలితాలు చూసిన కొంతమంది నెటిజన్లు ఈ విభాగంలో ‘రీల్‌ విలన్‌’,‘రియల్‌ హీరో’ సోనూ సూద్‌ పేరు కూడా చేరిస్తే బాగుండేది కదా అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement