
కోలీవుడ్ స్టార్ హీరో ఇటీవలే గుడ్ బ్యాడ్ అగ్లీ మూవీతో అభిమానులను అలరించారు. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్హిట్గా నిలిచింది. తొలిరోజే పాజిటివ్ టాక్ రావడంతో ప్రపంచవ్యాప్తంగా రూ.200 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ సినిమాను టాలీవుడ్ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మించింది.
ఇటీవలే పద్మభూషణ్ అవార్డ్ అందుకున్న అజిత్ కుమార్ తాజా ఇంటర్వ్యూలో ఆసక్తికర కామెంట్స్ చేశారు. తాను ఏ క్షణంలోనైనా సినిమాలను అర్ధాంతరంగా వదిలేయాల్సి రావొచ్చని షాకింగ్ కామెంట్స్ చేశారు. కేవలం తాను యాక్సిడెంటల్గా నటనలోకి వచ్చానని వెల్లడించారు. తన జీవితంలో రేసర్ కావాలని కోరుకున్నానని.. కానీ కుటుంబ ఆర్థిక పరిస్థితి వల్ల కుదరలేదని తెలిపారు. నీకిష్టమైన పనినే చేయాలని తన తండ్రి చెప్పేవారని.. కానీ అప్పులు తీర్చడానికి మోడలింగ్ వైపు అడుగులు వేశానని పేర్కొన్నారు. ఆ తర్వాత పూర్తి నటుడిగా మారి ఉన్న అప్పులన్నీ తీర్చానని వెల్లడించారు.