
బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్పై ప్రముఖ నటి రమ్య(దివ్య స్పందన) ఆసక్తికర కామెంట్స్ చేశారు. గతంలో కంగనా నటించిన 'మణికర్ణిక: ది క్వీన్ ఆఫ్ ఝాన్సీ' పోలుస్తూ మాట్లాడారు. ఎమర్జన్సీ చిత్రానికి బాక్సాఫీస్ వద్ద ప్రశంసలు వచ్చినప్పటికీ.. ఆ సినిమా నిర్మించిన తీరు బాగాలేదని ఆమె అన్నారు. కంగనా విషయానికొస్తే ఆమె అద్భుతమైన నటి అని కొనియాడింది. బెంగళూరు ఫిల్మ్ ఫెస్టివల్లో జరిగిన ప్యానెల్ చర్చ సందర్భంగా రమ్య కామెంట్స్ చేసింది. కాగా.. ఈ చిత్రంలో కంగనా భారత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ పాత్రలో నటించింది.
రమ్య మాట్లాడుతూ.. "ఎమర్జెన్సీ చిత్రం చెత్తగా నిర్మించారు. కంగనా రనౌత్ చాలా ప్రతిభావంతురాలైన నటి. ఆ సినిమాతో కంగనాకు ఎటువంటి సంబంధం లేదు. కానీ ఆ సినిమా చెడుగా తీయడం వల్లే ప్రేక్షకులు తిరస్కరించారు. గతంలో కంగనా మణికర్ణికను కూడా నిర్మించింది ఆ మూవీ కంటెంట్ బాగుంది. అందుకే ఆ సినిమాను ప్రేక్షకులు ఇష్టపడ్డారు. అందుకే బాక్సాఫీస్ వద్ద విజయం సాధించింది.' అని తెలిపింది. కాగా.. కంగనా రనౌత్ డైరెక్షన్లో తెరకెక్కించిన ఎమర్జన్సీ చాలాసార్లు వాయిదా పడిన తర్వాత జనవరి 17న థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రంలో అనుపమ్ ఖేర్, మహిమా చౌదరి, శ్రేయాస్ తల్పాడే, మిలింద్ సోమన్ ముఖ్యమైన పాత్రల్లో నటించారు.