నర్సాపూర్: పట్టణంలోని కన్యకా పరమేశ్వరీ మాత ఆలయంలో ఆషాఢం మాసం పురస్కరించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. సోమవారం మాతకు ప్రత్యేక అలంకరణ చేశారు. శాకాంబరీదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. పూజల్లో భక్తులు, పలువురు ఆర్యవైశ్య సంఘం సభ్యులు పాల్గొన్నారు.
లక్ష్మీనర్సింహస్వామి సన్నిధిలో న్యాయమూర్తి
శివ్వంపేట(నర్సాపూర్): ఉమ్మడి జిల్లాలో ప్రసిద్ధి చెందిన సికింద్లాపూర్ లక్ష్మీనర్సింహస్వామిని నర్సాపూర్ కోర్టు న్యాయమూర్తి హేమలత కుటుంబ సమేతంగా సోమవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చక సిబ్బంది న్యాయమూర్తికి పూర్ణకుంభంతో స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం తీర్థ ప్రసాదాలు, వేద ఆశీర్వాదం అందజేశారు. ఈ మేరకు ఆలయ విశిష్టత గురించి న్యాయమూర్తికి వివరించారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ శ్రీనివాస్, పధాన అర్చకులు ధనుంజయ్శర్మ, విద్యాకర్చారి, జూనియర్ సహాయకులు నర్సింహారెడ్డి ఉన్నారు.
కాంగ్రెస్లో చేరిక
రామచంద్రాపురం(పటాన్చెరు): తెల్లాపూర్ డివిజన్కు చెందిన బీఆర్ఎస్ నాయకులు వడ్డే శ్రీనివాస్ సోమవారం హైదరాబాద్లో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి సమీక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ కొల్లూరి భరత్, నాయకులు ప్రభాకర్ రెడ్డి, బాబు గౌడ్, వాజీద్లు పాల్గొన్నారు.


