
వక్ఫ్చట్టంతో పేద ముస్లింలకు మేలు
బీజేపీ జిల్లా అధ్యక్షుడు మల్లేశంగౌడ్
మెదక్జోన్: పేద ముస్లింలకు మేలు జరుగుతోందనే ఉద్దేశంతో ప్రధాని మోదీ వక్ఫ్బోర్డు చట్టాన్ని తెచ్చారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు మల్లేశంగౌడ్ అన్నారు. మంగళవారం వక్ఫ్బోర్డు చట్ట సవరణ జన జాగరణ అభియాన్లో భాగంగా చట్టం గురించి వివరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. వక్ఫ్చట్టాలపై అందరికీ అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని కార్యకర్తలకు సూచించారు. ఈ చట్టంపై కొందరు పనికట్టుకొని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అలాంటి వారి నోరు మూయించాలంటే ప్రజలకు వివరించాల్సిన బాధ్యత బూత్ కమిటీ సభ్యులపై ఉందన్నారు. కార్యక్రమంలో చంద్రయ్య, మాజీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్, రాగిరాములు, కొండలరావు జిల్లా ప్రధాన కార్యదర్శులు ఎంఎల్ఎన్రెడ్డి, ఓబీసీ నేత కాశినాథ్ తదితరులు పాల్గొన్నారు.