
ధరణితో భూములు దోచుకున్నారు
మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్
రామాయంపేట(మెదక్): గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ధరిణి పోర్టల్తో కేవలం కేసీఆర్ కుటుంబమే బాగుపడిందని మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ ఆరోపించారు. భూ భారతి చట్టంపై శుక్రవారం రైతువేదికలో రైతులకు అవగాహన కల్పించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మాది ప్రజా ప్రభుత్వమని, ప్రజల సమస్యలు తీర్చడమే తమ ధ్యేయమన్నారు. ధరణితో రైతులు తీవ్ర ఇబ్బందుల పడ్డారని ఆరోపించారు. ప్రజా సంక్షేమం మరిచిన బీఆర్ఎస్కు ప్రజలు తగిన బుద్ది చెప్పారని అన్నారు. అనంతరం కలెక్టర్ రాహుల్రాజ్ మాట్లాడుతూ.. ధరణి పోర్టల్లో పట్టా మార్పిడి అధికారం లేదని, భూభారతిలో ఈ అవకాశం ఉందన్నారు. కొత్త చట్టంలో కొంత మార్పు ఉందని, దీనితో రైతులకు మేలు కలుగుతుందని పేర్కొన్నారు.