బెల్లంపల్లి: పోలీసుస్టేషన్కు వచ్చే ప్రతీ ఫిర్యాదుదారుడితో మర్యాదగా వ్యవహరించాలని మంచిర్యాల డీసీపీ ఎగ్గడి భాస్కర్ అన్నారు. శుక్రవారం రాత్రి బెల్లంపల్లి టూ టౌన్ పోలీ స్స్టేషన్ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశా రు. నేరాల దర్యాప్తు పురోగతి, రికార్డులు, వి విధ రిజిష్టర్లు పరిశీలించారు. వివిధ నేరాల్లో స్వాధీనం చేసుకున్న వాహనాలను క్రమబ ద్ధంగా ఉంచాలని ఎస్సై తిరుపతిని ఆదేశించా రు. ఫిర్యాదుదారుల సమస్యలను చట్టపరంగా పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని తెలి పారు. రూరల్ సీఐ హనోక్ పాల్గొన్నారు.


