అమరుల త్యాగ ఫలితమే స్వాతంత్య్రం | - | Sakshi
Sakshi News home page

అమరుల త్యాగ ఫలితమే స్వాతంత్య్రం

Aug 14 2026 7:44 AM | Updated on Aug 14 2026 7:44 AM

మంచిర్యాలటౌన్‌: అమరుల త్యాగ ఫలితం వల్లనే దేశానికి స్వాతంత్య్రం వచ్చిందని, వారి త్యాగాలను మరువలేమని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఘునాథ్‌ వెరబెల్లి అన్నారు. జిల్లా కేంద్రంలో 500 మీటర్ల భారీ జాతీయ జెండాతో విద్యార్థులతో కలిసి గురువారం తిరంగా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా రఘునాథ్‌ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఇంటిపై జాతీయజెండా ఎగురవేయాలని కోరారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్‌గౌడ్‌, నాయకులు పెద్దపల్లి పురుషోత్తం, కొయ్యల ఏమాజి, దుర్గం అశోక్‌, గోలి రాము, వంగపల్లి వెంకటేశ్వర్‌రావు, ఎనగందుల కృష్ణమూర్తి, పట్టి వెంకటకృష్ణ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement