పట్టు కాయల ఉత్పత్తికి విఘాతం కల్పిస్తున్న చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ అధికారి శాంతరావు ఏ జిల్లాలో లేని ఆంక్షలు విధించి గిరిజనులకు ఉపాధి లేకుండా చేస్తున్నారు. ఈ ప్రాంత రైతుల కోసం గిరిజనశాఖ మంత్రిని కలిశాం. ఈ నెలాఖరులోపు ఫారెస్ట్ అధికారులు పట్టు సాగుకు అనుమతివ్వకుంటే ఉమ్మడి ఆదిలాబాద్ గిరిజన సంఘాల అధ్వర్యంలో జిల్లాను దిగ్బంధం చేస్తాం.
– జేక శేఖర్, ఆదివాసీ హక్కుల పోరాట,
తుడుం దెబ్బ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి


