చిన్నచింతకుంట మండలం అమ్మాపురం సమీపంలో వెలిసిన కురుమూర్తి గుట్టకు శ్రావణ శనివారం పురస్కరించుకొని భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఆలయ అర్చకులు స్వామివారికి సుప్రభాత సేవ నిర్వహించిన అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు. భక్తులు స్వామివారిని దర్శించుకొని ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అలివేలు మంగమ్మ, ఆంజనేయస్వామి, చెన్నకేశవస్వామి, ఉద్దాల మండపం వద్ద దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణమంతా గోవింద నామస్మరణతో మారుమోగింది. వచ్చిన భక్తులకు తీర్థప్రసాదాలు, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు.


