గ్రామ సమీపంలోని ప్రభుత్వ భూమి పిత్రి గుట్టను రెవెన్యూ అధికారులు దళారుల మధ్యవర్తిత్వంతో అక్రమ పట్టాలు చేస్తూ ముడుపులు దండుకుంటున్నారు. ఈ మధ్య కాలంలోనే సర్పంచ్ భర్త తన తండ్రి పేరిట ప్రభుత్వం భూ మి ఇచ్చిందని, ఇద్దరి పేరుపై ప్రస్తుత తహసీల్దార్తోనే అక్రమ పట్టా చేయించుకున్నాడు. ఇంకా రెండు ఎకరాలు చేయించుకోవా లని సర్వేయర్తో వస్తే అడ్డుకున్నాం. తమ వద్ద ఆధారాలు ఉన్నాయి.. కలెక్టర్ విచారణ చేసి అధికారులపై చర్యలు తీసుకోవాలి.
– మాదంశెట్టి నారాయణ, రామాజిపల్లి


