జడ్చర్ల మున్సిపాలిటీ భవనానికి ప్రభుత్వం దశల వారీగా రూ.5 కోట్లు మంజూరు చేసింది. 2023 అక్టోబర్ 2న అప్పటి ఎమ్మెల్యేగా ఉన్న డాక్టర్ సి.లక్ష్మారెడ్డి టీయూఎఫ్ఐడీసీ నుంచి రూ.3.06 కోట్లతో భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. తర్వాత ప్రహరీ, సీసీ రోడ్లు, తదితర పనులకు మరో రూ.2 కోట్లు మంజూరయ్యాయి. దీంతో మున్సిపల్ కార్యాలయాన్ని విశాలంగా అధునాతనంగా నిర్మించారు. ప్రహరీ, ఆవరణలో సీసీ పనులు కొనసాగుతున్నాయి. అక్కడక్కడ కొన్ని పనులు మినహా దాదాపుగా పనులు పూర్తయ్యాయి.


