కాజీపేట రూరల్ : కాజీపేటలోని హజ్రత్ సయ్యద్ షా అప్జల్ బియాబాని దర్గా ఉర్సుకు దేశ నలుమూలల నుంచి భక్తులు తరలి వస్తున్నారు. రెండో రోజు మంగళవారం తెల్లవారుజాము నుంచి భక్తులు అధిక సంఖ్యలో వచ్చి దర్గాను దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటున్నారు. తరలివస్తున్న భక్తులతో దర్గా ప్రాంగణం కిటకిట లాడింది. దేశంలోని వివిధ రాష్ట్రాల దర్గాల పీఠాధిపతులు దర్గాను దర్శించుకొని దర్గా పీఠాధిపతి ఖుస్రుపాషాను కలిశారు. కొనుగోలుదారులతో దుకాణాలు స ందడిగా మారాయి. స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి రాత్రి దర్గాను దర్శించుకుని పూజలు చేశారు.


