ఆలూరు నియోజకవర్గంలో అధికంగా ఉన్న బోయ, కురువ, ఎస్సీతో పాటు మిగిలిన బలహీనవర్గాల్లో కొందరు వీరభద్రగౌడ్కు అనుకూలంగా ఉన్నారు. జ్యోతి ఇన్చార్జి కాగానే ఆయా వర్గాలకు చెందిన చాలామంది టీడీపీ నేతలు, కార్యకర్తలను ఆమె దూరం పెట్టినట్లు ప్రచారం ఉంది. దీంతో పాత టీడీపీ కార్యకర్తలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వీరభద్ర గౌడ్ సైతం నియోజకవర్గ రాజకీయాలకు దూరంగా ఉండటంతో ఆయన వర్గం దిక్కుతోచని స్థితిలో పడింది. ఇప్పటికే పలుమార్లు జ్యోతిపై నియోజకవర్గానికి చెందిన పలువురు టీడీపీ నేతలు, కార్యకర్తలు అధిష్టానానికి ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.


