వలంటీర్ల భర్తీకి నేడు నోటిఫికేషన్‌ | - | Sakshi
Sakshi News home page

వలంటీర్ల భర్తీకి నేడు నోటిఫికేషన్‌

Mar 21 2023 1:20 AM | Updated on Mar 21 2023 1:20 AM

కర్నూలు(అర్బన్‌): జిల్లాలో ఖాళీగా ఉన్న 204 వలంటీర్‌ పోస్టులను భర్తీకి జిల్లా కలెక్టర్‌ పి.కోటేశ్వరరావు ఈనెల 21న నోటిఫికేషన్‌ జారీ చేయనున్నట్లు జిల్లా పరిషత్‌ సీఈఓ జి.నాసరరెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. 139 మంది గ్రామ, 65 మంది వార్డు వలంటీర్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. అర్హులైన అభ్యర్థులు ఈనెల 22 నుంచి 24వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలన్నారు. 25న దరఖాస్తుల పరిశీలన, 27న మౌఖిక పరీక్ష, 28న ఎంపికై న వారి వివరాలను తెలియజేస్తామన్నారు. ఎంపికై న అభ్యర్థులకు 30వ తేదీన శిక్షణా తరగతులను నిర్వహిస్తామని.. 31వ తేదీ నుంచి వలంటీర్లు తమ విధుల్లో చేరాల్సి ఉంటుందన్నారు. దరఖాస్తుదారులు 10వ తరగతి లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలన్నారు. మరిన్ని వివరాలకు సంబంధిత ఎంపీడీఓ/మున్సిపల్‌ కమిషనర్‌ అధికారి కార్యాలయాల్లో సంప్రదించాలని సీఈఓ పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement