తిరువూరు: అనారోగ్యంతో మృతిచెందిన మహిళా సంఘ నాయకురాలు మేకల రవికుమారి(56) మృతదేహాన్ని ఆమె కుటుంబసభ్యులు శనివారం మంగళగిరి ఎన్ఆర్ఐ వైద్యకళాశాలకు దానమిచ్చారు. ఈ మేరకు ఆమె భర్త, సీనియర్ న్యాయవాది, సీపీఎం పట్టణ కార్యదర్శి మేకల నాగేంద్రప్రసాద్ సమ్మతితో వైద్యులు రవికుమారి మృతదేహాన్ని ప్రత్యేక వాహనంలో ఎన్ఆర్ఐ ఆస్పత్రికి తరలించారు. సీపీఎం జిల్లా కార్యదర్శి డీవీ కృష్ణ, వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఇన్చార్జి నల్లగట్ల స్వామిదాసు, సీపీఎం రాష్ట్ర నాయకులు బీఆర్ తులసీరావు, స్థానిక నాయకులు రవికుమారి మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తిరువూరు కోర్టు న్యాయమూర్తి సింధూర, పలువురు న్యాయవాదులు రవికుమారి మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు.


