మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి | - | Sakshi
Sakshi News home page

మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి

Aug 8 2026 1:41 AM | Updated on Aug 8 2026 1:41 AM

మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి

ఘంటసాల: వ్యవసాయానికి అనుబంధంగా అధిక ఆదాయాన్నిచ్చే పుట్టగొడుగుల పెంపకం చేపట్టడం ద్వార మహిళలు పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలని కలెక్టర్‌ డీకే బాలాజీ అన్నారు. కేవీకేలో మూడు రోజులపాటు నిర్వహించిన పుట్టగొడుగుల శిక్షణ కార్యక్రమం శుక్రవారం ముగిసింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన కలెక్టర్‌ బాలాజీ మాట్లాడుతూ జిల్లాలో 700కు పైగా ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలను గుర్తించామన్నారు. వారికి మార్కెట్‌ అవకాశాలు కల్పించి అగ్రి టెక్‌ ఫార్మా వంటి సంస్థలతో వారిని అనుసంధానం చేశామన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బుట్టల ఎగ్జిబిషన్‌, ఆయుర్వేద ఎగ్జిబిషన్‌ను కలెక్టర్‌ పరిశీలించారు. జేసీ నవీన్‌, సహాయ కలెక్టర్‌ నమ్రత అగర్వాల్‌, కేవీకే ప్రోగ్రాం కోఆర్డినేటర్‌ డాక్టర్‌ డి. సుధారాణి, జిల్లా ఉద్యానవన శాఖాధికారి జె. జ్వోతి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement