మూడు చక్రాల వాహనాల పంపిణీ | - | Sakshi
Sakshi News home page

మూడు చక్రాల వాహనాల పంపిణీ

Apr 22 2025 12:58 AM | Updated on Apr 22 2025 12:58 AM

మూడు చక్రాల వాహనాల పంపిణీ

మూడు చక్రాల వాహనాల పంపిణీ

చిలకలపూడి(మచిలీపట్నం): సమాజంలో ఇతరుల మాదిరిగానే విభిన్న ప్రతిభావంతులు గర్వంగా బతకాలనే ఉద్దేశంతో ప్రభుత్వం వారికి అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తోందని కలెక్టర్‌ డీకే బాలాజీ పేర్కొన్నారు. కలెక్టరేట్‌లో పాఠశాల విద్య – సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో కలెక్టర్‌ బాలాజీ దివ్యాంగులకు మూడు చక్రాల సైకిళ్లను సోమవారం ఉచితంగా పంపిణీ చేశారు. కలెక్టర్‌ మాట్లాడుతూ ఇటీవల సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో విభిన్న ప్రతిభావంతులకు ఆరోగ్య శిబిరాలను నిర్వహించి వారికి ఏ అవసరాలు ఉన్నాయో గుర్తించామన్నారు. ఆ మేరకు జిల్లాలో 132 మందికి 212 బ్యాటరీ మూడు చక్రాల వాహనాలు, చక్రాల కుర్చీలు, మూడు చక్రాల సైకిళ్లు, నడక కర్రలు తదితర రూ.15,63,218 విలువైన పరికరాలు కేంద్ర ప్రభుత్వం తరఫున అలింకో సంస్థ సహకారంతో అందజేస్తున్నామన్నారు. ఈ అవకాశాన్ని విభిన్న ప్రతిభావంతులందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ సందర్భంగా లబ్ధిపొందిన దివ్యాంగులు తమకు మూడు చక్రాల వాహనాలు అందించినందుకు సంతోషం వ్యక్తం చేస్తూ కలెక్టర్‌కు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో సమగ్ర శిక్ష అధికారి డీటీడబ్ల్యూ ఫణి ధూర్జటి, దివ్యాంగుల శాఖ సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement