రాష్ట్ర మహాసభల పోస్టర్‌ ఆవిష్కరణ | - | Sakshi
Sakshi News home page

రాష్ట్ర మహాసభల పోస్టర్‌ ఆవిష్కరణ

Aug 27 2026 12:18 AM | Updated on Aug 27 2026 12:18 AM

కాగజ్‌నగర్‌టౌన్‌: పట్టణంలోని ప్రభుత్వ సామాజిక ఆస్పత్రిలో ఔట్‌సోర్సింగ్‌ కార్మికులతో కలిసి బుధవారం ఏఐటీయూసీ రాష్ట్ర మహాసభల పోస్టర్‌ను ఆ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బోగె ఉపేందర్‌ ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ ఎన్నో పోరాటాల అనంతరం ఏఐటీయూసీ 44 కార్మిక చట్టాలను సాధించినట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ల మేలు కోసమే వ్యాపారం సులభతరం పేరుతో ఆ చట్టాలను రద్దు చేసి నాలుగు లేబర్‌ కోడ్‌లుగా రూపొందించిందని ఆరోపించారు. కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్‌ కోడ్‌లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. కాగా, సెప్టెంబర్‌ 6 నుంచి 8 వరకు ఏఐటీయూసీ రాష్ట్ర మహాసభలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి షకీర్‌, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జంషద్‌, నాయకులు శివమ్‌, ఆసయి, మీనాక్షి, రాజేశ్‌, పుష్పలత, తిరుమల, శారద తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement