న్యూస్రీల్
ఆసిఫాబాద్రూరల్: విద్యార్థులు క్రమశిక్షణతో చదివి సమాజానికి ఆదర్శంగా నిలువాలని జిల్లా జడ్జి శారదాదేవి సూచించారు. శనివా రం జిల్లా కేంద్రంలోని సెయింట్ మేరీ పాఠశాలలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించా రు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వి ద్యార్థులు తమ హక్కులు, చట్టాలు, నైతిక విలువలపై పూర్తి అవగాహన కలిగి ఉండాల ని సూచించారు. 39(ఏ) ఆర్టికల్ ద్వారా ప్రతీ వ్యక్తికి ఉచిత న్యాయ సహాయం పొందవచ్చని తెలిపారు. పట్టుదలతో చదివితే అనుకు న్న లక్ష్యం చేరుకోవచ్చని పేర్కొన్నారు. భవి ష్యత్లో మంచి సమాజ సేవకులు కావాలని సూచించారు. జూనియర్ సివిల్ జడ్జి అనంతలక్ష్మి, డీసీపీవో మహేశ్ పాల్గొన్నారు.


