చింతలమానెపల్లి: విద్యాశాఖను పర్యవేక్షించే విద్యావనరుల కార్యాలయం మండల కేంద్రంలోని ప్రభు త్వ ప్రాథమిక పాఠశాలలోని గదిలో ఏర్పాటు చేశా రు. ఒకే గదిలో ఒక మూలన సామగ్రి, మరో మూ లన అట్టపెట్టెల్లో మంజూరైన కంప్యూటర్లున్నాయి. వీటి మధ్య సిబ్బంది విధులు నిర్వహించే పరిస్థితి లేదు. దీంతో కంప్యూటర్లు వినియోగించ లేక పక్కనున్న మండల కేంద్రం కౌటాల మండల విద్యాశా ఖ కార్యాలయంలో సిబ్బంది విధులు నిర్వహించా ల్సి వస్తోంది. డిజిటల్ విద్యావిధానం, ఆన్లైన్ వి ధుల కోసం రూ.లక్షల విలువైన సామగ్రి మంజూ రు చేస్తున్న ప్రభుత్వ అధికారులు భవనాలను కేటా యించకపోవడంపై మండల ప్రజలు ఆగ్రహం వ్య క్తజేస్తున్నారు. వెంటనే నూతన భవనాన్ని మంజూరు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.


