రక్తదానం ప్రాణదానంతో సమానం | - | Sakshi
Sakshi News home page

రక్తదానం ప్రాణదానంతో సమానం

Jan 6 2026 2:01 PM | Updated on Jan 6 2026 2:01 PM

రక్తదానం ప్రాణదానంతో సమానం

రక్తదానం ప్రాణదానంతో సమానం

కౌటాల: రక్తదానం ప్రాణదానంతో సమానమని జిల్లా వైద్యశాఖ అధికారి సీతారాం అ న్నారు. సోమవారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జగద్గురు రామానందాచార్య దక్షిణ్‌ పీఠం నానీజ్‌థామ్‌ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరోగ్యవంతులైన 18 నుంచి 55 ఏళ్లలోపు వారు మూడు నెలలకోసారి రక్తదానం చేయాలని సూచించారు. ప్రమాదాలు జరిగిన సమయంలో క్షతగాత్రులకు రక్తం దొరకడం లేదన్నారు. ఈ సందర్భంగా 111 మంది నుంచి రక్తం సేకరించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఐ సంతోష్‌కుమార్‌, ఎస్సై చంద్రశేఖర్‌, వైద్యులు రవీంద్రకుమార్‌, అజ్మత్‌, నవ త, పవన్‌ కళ్యాణ్‌రెడ్డి, సంఘం జిల్లా అధ్యక్షుడు రాజేందర్‌, కమిటీ సభ్యులు కాలిదాస్‌, పండరి, తులసీరాం, మహేంద్ర, బావుజీ, దోమాజి, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement