
ప్రశాంతంగా ‘మోడల్’ పరీక్ష
ఆసిపాబాద్రూరల్: తెలంగాణ మోడల్ స్కూ ళ్లలో 6 నుంచి పదో తరగతి వరకు సీట్ల భర్తీ కోసం ఆదివారం జిల్లాలో నిర్వహించిన ప్రవే శ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. జిల్లాలో మూడు కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఆరో తరగతిలో ప్రవేశం కోసం ఉదయం నిర్వహించిన పరీక్షకు 491 మంది విద్యార్థులకు 397 మంది హాజరు కాగా, 94 మంది గైర్హాజరయ్యారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు నిర్వహించిన ఏడో తరగతి ప్రవేశ పరీక్షకు 167 మందికి 136 మంది, ఎనిమిదో తరగతికి 120 మందికి 95 మంది, తొమ్మిదో తరగతికి 85 మందికి 66 మంది, పదో తరగతికి 32 మందికి 22 మంది హాజరయ్యారని జిల్లా పరీక్షల నిర్వహణ అధికారి ఉదయ్బాబు తెలిపారు. జిల్లా కేంద్రంలోని మోడల్ స్కూల్, బాలికల ఉన్నత పాఠశాలలోని కేంద్రాలను ఆయన తనిఖీ చేశారు.