మధిర: తిరుపతి నుంచి ఆదిలాబాద్ వైపు వెళ్లే కృష్ణా ఎక్స్ప్రెస్ రైలు ఏసీ బోగీలో సోమవారం మంటలు వ్యాపించాయి. కృష్ణా ఎక్స్ప్రెస్ రైలు ఎర్రుపాలెం రైల్వేస్టేషన్ దాటగానే బీ4 ఏసీ బోగీలో కంప్రెషన్ బెల్టులు కాలిపోయి పొగ వ్యాపించింది. ప్రయాణికులు గమనించి చైన్ లాగడంతో తొండల గోపవరం రైల్వేస్టేషన్ వద్ద నిలిచిపోయింది. అప్పటికే పొగకు తోడు మంటలు వ్యాపిస్తుండడంతో ఆందోళనకు గురైన ప్రయాణికులు కిందకు దిగారు. ఏసీ మెకానిక్ వచ్చి మరమ్మతులు చేపట్టి కాలిపోతున్న ఏసీ కంప్రెషర్ బెల్ట్లను తొలగించాక సుమారు 20 నిమిషాల అనంతరం రైలు తిరిగి బయలుదేరింది. ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో ప్రయాణికులు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.


