సమస్యలు పరిష్కరించాలని మంత్రికి వినతి | - | Sakshi
Sakshi News home page

సమస్యలు పరిష్కరించాలని మంత్రికి వినతి

Jul 17 2026 12:41 AM | Updated on Jul 17 2026 12:41 AM

ఖమ్మంవైద్యవిభాగం: ఆరోగ్యశ్రీ ప్రభుత్వ ఆస్పత్రుల డేటా ఎంట్రీ ఆపరేటర్ల సమస్యలు పరిష్కరించాలని సంఘం ప్రతినిధులు గురువారం హైదరాబాద్‌లో రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్‌ రాజనర్సింహకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ప్రతినిధులు మాట్లాడుతూ 18ఏళ్లుగా పనిచేస్తున్న తమకు ఉద్యోగ భద్రత లేనందున కాంట్రాక్ట్‌ పద్ధతిలో నియమించి, ఐఎఫ్‌ఎమ్‌ఎస్‌ ద్వారా వేతనాలు చెల్లిండమే కాక పీఎఫ్‌, ఈఎస్‌ఐ వర్తింపజేయాలని కోరారు. అంతేకాక గత 10–12 నెలలుగా పెండింగ్‌ వేనాలు చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లాకు చెందిన అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వినయ్‌భాస్కర్‌, జి.సుధాకర్‌తో పాఉ నిఖిలేష్‌, రఘురామ్‌, నిరంజన్‌, నాగేష్‌, బాలు, కృష్ణ, సమత, భాస్కర్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement