ఉమ్మడి జిల్లాకు 2,638 మెట్రిక్‌ టన్నుల యూరియా | - | Sakshi
Sakshi News home page

ఉమ్మడి జిల్లాకు 2,638 మెట్రిక్‌ టన్నుల యూరియా

Aug 16 2025 7:13 AM | Updated on Aug 16 2025 7:13 AM

ఉమ్మడి జిల్లాకు 2,638 మెట్రిక్‌ టన్నుల యూరియా

ఉమ్మడి జిల్లాకు 2,638 మెట్రిక్‌ టన్నుల యూరియా

చింతకాని: మండలంలోని నాగులవంచ రైల్వేస్టేషన్‌ను యథావిధిగా కొనసాగిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రకటించారు. ప్రయాణికుల నుంచి ఆదరణ లేదంటూ ఇటీవల స్టేషన్‌ను మూసివేయనున్నట్లు ప్రకటించారు. దీంతో సమీప గ్రామాల ప్రజలు స్టేషన్‌ను కొనసాగించాలంటూ నిరసనలు తెలిపారు. దీంతో రైల్వే అధికారులు తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని స్టేషన్‌ను యథావిధిగా కొనసాగించన్నుట్లు ప్రకటించడంపై ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.

చింతకాని: ఆర్‌ఎఫ్‌సీఎల్‌ కంపెనీ నుంచి జిల్లాకు 2,638.44 టన్నుల యూరియా సరఫరా అయింది. చింతకాని మండలం పందిళ్లపల్లి రేక్‌ పాయింట్‌కు శుక్రవారం చేరిన యూరియాను ఏఓ(టెక్నికల్‌) పవన్‌కుమార్‌ పరిశీలించి జిల్లాల వారీగా కేటాయించారు. ఖమ్మం జిల్లాకు 1,538.44 మెట్రిక్‌ టన్నులు, భద్రాద్రి జిల్లాకు వెయ్యి టన్నులు కేటాయించగా వంద మెట్రిక్‌ టన్నుల యూరియాను బఫర్‌ స్టాక్‌గా నిల్వ చేసినట్లు ఏఓ తెలిపారు. జిల్లాకు సరిపడా యూరియా చేరినందున రైతులెవరూ ఆందోళన చెందొద్దని ఆయన సూచించారు.

ప్రవేశాలకు సెప్టెంబర్‌ 10వరకు గడువు

ఖమ్మం సహకారనగర్‌: కాకతీయ యూనివర్సిటీ పరిధి సెంటర్‌ ఫర్‌ డిస్టెన్స్‌ అండ్‌ ఆన్‌లైన్‌ ఎడ్యుకేషన్‌(గతంలో ఎస్‌డీఎల్‌సీఈ)లో డిగ్రీ, పీజీ, డిప్లొమా కోర్సులో ప్రవేశానికి సెప్టెంబర్‌ 10వ తేదీ వరకు గడువు పొడిగించారు. ఈ విషయాన్ని ఖమ్మంలోని యూనివర్సిటీ పీజీ కళాశాల అధ్యయన కేంద్రం కోఆర్డినేటర్‌ డాక్టర్‌ గోపి తెలిపారు. ప్రవేశాలకు ఆసక్తి ఉన్నవారు ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించారు. ఫీజు, అర్హతలు వివరాల కోసం అధ్యయన కేంద్రం సెల్‌ నంబర్‌ 80088 11998 లేదా కేయూ దూరవిద్య కేంద్రం వెబ్‌సైట్‌లో పరిశీలించాలని సూచించారు.

నాగులవంచ రైల్వేస్టేషన్‌ కొనసాగింపు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement