
దెయ్యాల గురించి వైరల్ అయిన పోస్టులు, యూట్యూబర్ గోపి
మండ్య : సోషల్ మీడియాలో వైరల్ కావాలని చిత్ర విచిత్రమైన వీడియోలను తయారు చేస్తూ ఉంటారు కొందరు. అదే కోవలో దెయ్యాలు తిరుగుతున్నాయని, కనిపించినవారిపై దాడులు చేస్తున్నాయని వీడియోలు తీసిన ఓ ఘనుని ఉదంతమిది. మండ్య జిల్లాలోని నాగమంగలలో వెలుగుచూసింది.
వివరాలు.. పట్టణవాసి గోపి యూట్యూబ్ వీడియోలు చేస్తుంటాడు. దేవలాపుర హ్యాండ్పోస్ట్ వద్ద దెయ్యాలు తిరుగుతున్నాయని, అవి ప్రజలను చాలా ఇబ్బందులు పెడుతున్నాయని ఓ వీడియోను సృష్టించి పోస్ట్ చేశాడు. అందులో ఓ మహిళ దయ్యం మాదిరిగా ప్రవర్తిస్తూ ఉంటుంది. ఆ వీడియో చూసిన ప్రజలు నిమేననుకుని హడలిపోయారు. ఈ విషయం పోలీసులకు తెలిసి గోపిని పిలిపించారు. ఎలాంటి దయ్యాలు లేవని, వ్యూస్ కోసం నకిలీ వీడియోను రూపొందించానని గోపి చెప్పాడు. ఆ వీడియోను తొలగించాడు. ఎలాంటి దయ్యాలు లేవు, ప్రజలు భయపడకండి అని పోలీసులు ఫ్యాక్ట్ చెక్ అని ఓ పోస్టింగ్ను ఉంచారు.