లబ్ధిదారులకు హక్కు పత్రాల పంపిణీ | - | Sakshi
Sakshi News home page

లబ్ధిదారులకు హక్కు పత్రాల పంపిణీ

Dec 24 2025 3:55 AM | Updated on Dec 24 2025 3:55 AM

లబ్ధిదారులకు హక్కు పత్రాల పంపిణీ

లబ్ధిదారులకు హక్కు పత్రాల పంపిణీ

హొసపేటె: నగరంలోని తాండా, హాడి, ఇతర మురికివాడలలో దశాబ్దాలుగా నివసిస్తున్న పత్రాలు లేని 351 మంది లబ్దిదారులకు ప్రభుత్వం ఇంటి హక్కు పత్రాలను అందించడం ద్వారా చట్టబద్ధమైన యాజమాన్య హక్కును కల్పించిందని ఎమ్మెల్యే హెచ్‌ఆర్‌.గవియప్ప అన్నారు. బళ్లారిలోని కర్ణాటక మురికివాడల అభివృద్ధి బోర్డు సబ్‌–డివిజన్‌, నగరంలోని జిల్లా ఇండోర్‌ స్టేడియంలో వసతి శాఖ నిర్వహించిన కార్యక్రమంలో లబ్ధిదారులకు టైటిల్‌ డీడ్‌లను పంపిణీ చేసిన తర్వాత ఆయన మాట్లాడారు. నిరాశ్రయులైన నివాసులకు అధికారిక యాజమాన్య హక్కును అందించడానికి ప్రభుత్వం సాహసోపేతమైన చర్యలు తీసుకుందన్నారు. ఈ పత్రాలు యజమానులకు బ్యాంకు రుణాలు, ప్రభుత్వ సబ్సిడీ పొందడానికి సహాయపడతాయన్నారు. హుడా చైర్మన్‌ హెచ్‌ఎన్‌ఎఫ్‌ ఇమాం నియాజీ, మున్సిపల్‌ కౌన్సిల్‌ చైర్మన్‌ రూపేష్‌కుమార్‌, అసిస్టెంట్‌ కమిషనర్‌ పీ.వివేకానంద, తహసీల్దార్‌ ఎం.శృతి, ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ మనోహర్‌, మున్సిపల్‌ కమిషనర్‌ శివకుమార్‌, స్లం డెవలప్‌మెంట్‌ బోర్డు ఏఈఈ వి.తిమ్మన్న పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement