ఉన్నతాధికారిణి వేధింపులు.. అటవీ ఉద్యోగి ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

ఉన్నతాధికారిణి వేధింపులు.. అటవీ ఉద్యోగి ఆత్మహత్య

May 1 2025 12:22 AM | Updated on May 1 2025 12:22 AM

ఉన్నత

ఉన్నతాధికారిణి వేధింపులు.. అటవీ ఉద్యోగి ఆత్మహత్య

మైసూరు: తన చావుకు అసిస్టెంట్‌ కన్సర్వేటర్‌ ఆఫ్‌ ఫారెస్ట్స్‌ (ఏసీఎఫ్‌) మేడం కారణం అని డెత్‌నోట్‌ రాసిపెట్టి అటవీ వాచర్‌ ఆత్మహత్య చేసుకున్న ఘటన మైసూరు జిల్లా సరగూరు తాలూకాలో జరిగింది. అటవీ వీక్షకుడు పీ.సురేష్‌ (34) ని ఏసీఎఫ్‌ అమృత మాయప్పనవర్‌ వేధిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. సురేష్‌ చామరాజనగర జిల్లా గుండ్లుపేటె తాలూకా బెరంబాడి గ్రామ నివాసి. అటవీ సిబ్బందికి కేటాయించిన క్వార్టర్లలో ఉరి వేసుకోవడంతో కుళ్లిన స్థితిలో మృతదేహం లభించింది. సురేష్‌ చావుకు ఏసీఎఫ్‌ అమృత కారణమని కుటుంబ సభ్యులు ఆరోపించారు. డెత్‌నోట్‌ ఉన్నా కడుపునొప్పిగా ఎఫ్‌ఐఆర్‌లో నమోదు చేయడంలో ఉన్నతాధికారిణి హస్తం ఉందని వాపోయారు. న్యాయం చేయాలని కుటుంబ సభ్యులు, స్థానికులు కోరారు.

ముంబై నుంచి పిలిపించి

దంపతుల హత్య

దొడ్డబళ్లాపురం: అక్రమ సంబంధం పగతో దంపతులను హత్య చేసిన సంఘటన బీదర్‌ జిల్లా బసవ కళ్యాణ తాలూకా కోహినూరు పహాడ వద్ద జరిగింది. జాఫరవాడి గ్రామ నివాసి రాజు కాంతప్ప (28), భార్య శారద (24) హత్యకు గురయ్యారు. యరండగి గ్రామానికి చెందిన దత్తాత్రేయ వాలె, తుకారాం నిందితులు. హతుడు రాజు, దత్తాత్రేయ సహోదరితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని కక్షగట్టి అతనితో పాటు భార్యను కూడా చంపేశారని పోలీసులు చెబుతున్నారు. భార్యతో కలిసి రాజు ఇటీవలే కూలి పనుల కోసం ముంబైకి వెళ్లాడు. అయితే గ్రామంలో మాట్లాడాలని ఫోన్‌ చేసి రప్పించారు. నిర్జనప్రదేశానికి తీసికెళ్లి కత్తులతో నరికి చంపారు. దత్తాత్రేయ, ఇతని సహోదరి, తుకారాంలను అరెస్టు చేశారు.

ప్రాణం తీసిన మొబైల్‌ కాల్‌

దొడ్డబళ్లాపురం: మొబైల్‌ఫోన్‌లో మాట్లాడుతూ రైలు పట్టాలు దాటుతున్న ఎంబీఏ విద్యార్థిని రైలు ఢీకొని మరణించిన సంఘటన దావణగెరె జిల్లా హరిహర రైల్వేస్టేషన్‌లో జరిగింది. బళ్లారికి చెందిన శ్రావణి (23) మైసూరులో ఎంబీఏ చదువుతోంది. హరిహరలో బంధువుల ఇంట్లో శుభకార్యం ఉండడంతో వచ్చింది. మంగళవారం రాత్రి మైసూరుకు వెళ్లడానికి రైల్వేస్టేషన్‌కు వచ్చి ఫోన్లో మాట్లాడుతూ పట్టాలు దాటుతూ ఉండగా, రైలు దూసుకొచ్చింది. ఢీకొనడంతో తీవ్ర గాయాలతో మరణించింది.

మోదీ నియంతృత్వ వైఖరి: సీఎం

యశవంతపుర: ప్రధాని నరేంద్ర మోదీ నిర్వహిస్తున్న మన్‌కీ బాత్‌లో ఏకపక్షంగా చెబుతూ ఆ మాటలను అందరూ వినాలనే ధోరణి మంచిదికాదని సీఎం సిద్దరామయ్య ఆరోపించారు. ఇది నియంతృత్వ వైఖరిగా కనిపిస్తోందన్నారు. బుధవారం కూడల సంగమంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజాస్వామ్యంలో చర్చించడం చూశాం, కానీ మోదీ వద్ద ఏదీ చర్చించే అవకాశం లేదని అన్నారు. నేను చెప్పింది మీరందరూ వినాలి అనే సర్వాధికార ధోరణి సమాజానికి మంచిదికాదని దుయ్యబట్టారు. కాగా, పాకిస్తాన్‌కు అనుకూలంగా ఎవరు మాట్లాడినా అది దేశద్రోహమని సిద్దరామయ్య తెలిపారు. పాకిస్తాన్‌కు అనుకూల పోస్టింగులు పెట్టిన 15 మందిపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు చెప్పారు.

ఉన్నతాధికారిణి వేధింపులు.. అటవీ ఉద్యోగి ఆత్మహత్య 1
1/2

ఉన్నతాధికారిణి వేధింపులు.. అటవీ ఉద్యోగి ఆత్మహత్య

ఉన్నతాధికారిణి వేధింపులు.. అటవీ ఉద్యోగి ఆత్మహత్య 2
2/2

ఉన్నతాధికారిణి వేధింపులు.. అటవీ ఉద్యోగి ఆత్మహత్య

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement