ఇక్కడి సిమ్‌లు విదేశాలకు | - | Sakshi
Sakshi News home page

ఇక్కడి సిమ్‌లు విదేశాలకు

May 20 2024 9:30 AM | Updated on May 20 2024 10:21 AM

ఇక్కడి సిమ్‌లు విదేశాలకు

ఇక్కడి సిమ్‌లు విదేశాలకు

అక్కడి నుంచి సైబర్‌ మోసాలు

సిమ్‌కార్డుల సరఫరాదారు అరెస్టు

బనశంకరి: భారత సిమ్‌కార్డును వినియోగించి విదేశాల్లో నుంచి సైబర్‌ మోసాలకు పాల్పడుతున్న ముఠా సమాచారాన్ని బెంగళూరు ఈశాన్య విభాగం సైబర్‌క్రైం పోలీసులు ఛేదించారు. వంచక ముఠాకు సిమ్‌ కార్డులను సరఫరా చేస్తున్న విశాఖపట్టణానికి చెందిన వ్యక్తిని అరెస్టు చేశారు. ముఠా నేరగాళ్లు నకిలీ ఆధారాలను అందించి ఏజెంట్ల ద్వారా వివిధ కంపెనీల సిమ్‌కార్డులను కొనుగోలు చేశారు. బెంగళూరు, చైన్నె, విశాఖపట్టణంతో పాటు దేశంలోని వివిధ మహా నగరాల నుంచి సిమ్‌కార్డులను కొని, యాక్టివేట్‌ చేసి వియత్నాం, కాంబోడియాకు కొరియర్‌ ద్వారా పంపించేవారని పోలీసులు తెలిపారు. నిందితుడు విశాఖపట్టణం నుంచి బెంగళూరుకు వచ్చి ఇక్కడి నుంచి కాంబోడియాకు సిమ్‌కార్డులు పంపించేవాడు.

మోసాలు ఇలా చేసేవారు
ఆ సిమ్‌కార్డుల ద్వారా వాట్సాప్‌ ఉపయోగించి మోసగాళ్లు వంచనకు తెగబడుతున్నారు. దేశంలోని పౌరులకు కాల్‌ చేసి, తప్పుడు వివరాలున్న లింకులను పంపి డబ్బు దోచుకునేవారు. షేర్‌ మార్కెట్‌ పెట్టుబడి, ఇంట్లో కూర్చుని చేసే పార్ట్‌టైమ్‌ ఉద్యోగాలు అందిస్తామని మెసేజ్‌లు పంపేవారు. భారత మొబైల్‌ నంబర్లతోనే ఉండడంతో జనం అనుమానించేవారు కాదు. వాటిని నమ్మి లింక్‌ ఓపెన్‌ చేసి, ఓటీపీ షేర్‌ చేస్తే చాలు బాధితుల బ్యాంకు ఖాతాల నుంచి వంచకులు నగదు కాజేస్తారు. విశాఖపట్టణం వాసిని అరెస్టు చేసి విచారణ చేపట్టారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement