త్వరలోనే రైతులకు పంట నష్టపరిహారం | - | Sakshi
Sakshi News home page

త్వరలోనే రైతులకు పంట నష్టపరిహారం

Nov 29 2023 1:38 AM | Updated on Nov 29 2023 1:38 AM

పంట నష్టంపై రైతుల గోడు ఆలకిస్తున్న
మంత్రి చెలువరాయస్వామి, ఎమ్మెల్యే తుకారాం - Sakshi

పంట నష్టంపై రైతుల గోడు ఆలకిస్తున్న మంత్రి చెలువరాయస్వామి, ఎమ్మెల్యే తుకారాం

బళ్లారిటౌన్‌: త్వరలోనే అనావృష్టితో నష్టపోయిన రైతులకు పంట నష్టపరిహారాన్ని అందజేస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి చెలువరాయస్వామి పేర్కొన్నారు. మంగళవారం జిల్లాలోని సండూరు తాలూకాలో వివిధ గ్రామాల్లో అనావృష్టితో పంటలు దెబ్బతిన్న పొలాలను సందర్శించిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇప్పటికే ఈ వషయంపై కేంద్ర వ్యవసాయ శాఖా మంత్రితో చర్చించినట్లు తెలిపారు. ఈ పంట నష్టపరిహారం పొందాలంటే ఫోర్త్‌ ఐడీ రైతులు తమ పేరున భూములను నమోదు చేసుకోవాలన్నారు. దీన్ని వల్ల పరిహారం పొందేందుకు అనుకూలం అవుతుందన్నారు. ఈ నెలాఖరులో కేంద్ర ప్రభుత్వం నుంచి పరిహారం విడుదల కావచ్చన్నారు. కేంద్రం నుంచి నిధులు రాగానే సన్న, అతిసన్నకారు రైతులకు ఈ పరిహారాన్ని అందిస్తామన్నారు. ఈ సందర్భంగా సండూరు ఎమ్మెల్యే తుకారాం, జెడ్పీ సీఈఓ రాహుల్‌ శరణప్ప, వ్యవసాయ శాఖ జేడీ కే.మల్లికార్జున, డీడీలు కెంగేగౌడ, సంతోష్‌, తహసీల్దార్‌ పవన్‌కుమార్‌, ఏడీలు మంజునాథ, హనుమంతప్ప తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement