ఆదర్శనేత సురేశ్‌ గౌడ | - | Sakshi
Sakshi News home page

ఆదర్శనేత సురేశ్‌ గౌడ

May 2 2023 12:56 AM | Updated on May 2 2023 6:46 AM

- - Sakshi

తుమకూరు: సురేష్‌ గౌడ్‌ ఒక ఆదర్శవంతమైన నేత అని, మోసంతో గతంలో ఓడిపోయారని, ఈసారి 50 వేల ఓట్ల మెజారిటీతో గెలిపించాలని మాజీ సీఎం బీఎస్‌ యడియూరప్ప పిలుపునిచ్చారు. తుమకూరు గ్రామీణ నియోజకవర్గంలో రోడ్‌ షో నిర్వహించారు. ఈ సందర్భంగా యడియూరప్ప మాట్లాడుతూ సురేశ్‌ గౌడ వంటి ఎమ్మెల్యే ఇంకొకరు దొరకరని, ఎంతో ప్రామాణికంగా పని చేశారని కొనియాడారు. ఈసారి మాత్రం కచ్చితంగా చట్టసభకు సురేశ్‌ గౌడను పంపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

మళ్లీ బీజేపీదే అధికారం
శివాజీనగర:
విధానసభ ఎన్నికల్లో బీజేపీ పూర్తి మెజారిటీతో మళ్లీ అధికారం చేపడుతుందని బెంగళూరు సెంట్రల్‌ ఎంపీ పీ.సీ.మోహన్‌ విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. సోమవారం సర్వజ్ఞన నగర బీజేపీ అభ్యర్థి పద్మనాభరెడ్డికి మద్దతుగా బాణసవాడి, సేవానగర తదితర ప్రాంతాల్లో రోడ్‌షో నిర్వహించి ప్రచారం చేపట్టి ఈ సందర్భంగా మాట్లాడారు. కేంద్రంలో ప్రధాని మోదీ ప్రభుత్వ సాధనాలు, రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి పనులే తమ పార్టీ అభ్యర్థులు గెలుపునకు అవకాశమన్నారు. ప్రస్తుత ఎమ్మెల్యే కే.జే.జార్జ్‌కు పోటీగా బరిలో ఉన్న బీజేపీ అభ్యర్థి పద్మనాభరెడ్డిని గెలిపించాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement