ఇందిరమ్మ నమూనా ఇల్లు | - | Sakshi
Sakshi News home page

ఇందిరమ్మ నమూనా ఇల్లు

Apr 27 2025 12:13 AM | Updated on Apr 27 2025 12:13 AM

ఇందిర

ఇందిరమ్మ నమూనా ఇల్లు

కరీంనగర్‌ అర్బన్‌: ఇందిరమ్మ ఇళ్ల పథకానికి ఇప్పటికే నిధులు మంజూరు చేసిన ప్రభుత్వం నమూనా ఇళ్లు నిర్మించాలని ఆదేశించింది. కలెక్టరేట్‌ ఆవరణలో నిర్మాణం పూర్తవుతుండగా తాజాగా ఆర్డీవో కార్యాలయాల ఆవరణలో మోడల్‌ హౌస్‌ నిర్మాణాలకు చర్యలు చేపట్టారు. కరీంనగర్‌, హుజూరాబాద్‌ ఆర్డీవో కార్యాలయాల ప్రాంగణాల్లో ఈ మోడల్‌ హౌస్‌ను నిర్మిస్తున్నారు. వివిధ పనుల నిమిత్తం ప్రజలు కార్యాలయాలకు వస్తుండగా ప్రభుత్వమిచ్చే రూ.5లక్షలతో ఎలా నిర్మించవచ్చో ప్రాక్టికల్‌గా చూపించనున్నారు.

సమస్యలు పరిష్కరించాలి

కరీంనగర్‌సిటీ: సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కరీంనగర్‌లోని శాతవాహన యూనివర్సిటీ ఎదుట కాంట్రాక్ట్‌ అధ్యాపకులు చేపట్టిన సమ్మె నాలుగో రోజు కొనసాగింది. వీరికి వర్సిటీ బోధనేతర సిబ్బంది సంఘీభావం తెలిపారు. బోధనేతర సిబ్బంది సంఘం ప్రధాన కార్యదర్శి పి.ప్రసాద్‌ మాట్లాడుతూ.. కాంట్రాక్టు అధ్యాపకులను త్వరగా క్రమబద్ధ్దీకరించాలని, వారి సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని కోరారు. జీవో 21ను సవరించాలని, పార్ట్‌టైం అధ్యాపకులను రెగ్యులరైజ్‌ చేయాలన్నారు. అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు సంతోష్‌, శ్రీకాంత్‌, మారుతి, భీమయ్య, ప్రకాశ్‌రావు పాల్గొన్నారు.

విద్యార్థులకు కరిక్యులం రూపొందించాం

కరీంనగర్‌సిటీ: విద్యార్థులకు అవసరమైన కరిక్యులం రూపొందించి, అమలు చేస్తున్నామని ఎస్సారార్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ రామకృష్ణ పేర్కొన్నారు. కళాశాలలో మూడో అకడమిక్‌ కౌన్సిల్‌ సమావేశం శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్‌ రామకృష్ణ మాట్లాడుతూ.. అటానమస్‌ హోదా ఎస్‌ఆర్‌ఆర్‌ కళాశాలకు 2022–23లో వచ్చిందన్నారు. 2025లో మూడో సంవత్సరం విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారని, విద్యార్థులకు అవసరమైన కరికులం రూపొందించడం జరిగిందన్నారు. అటానమస్‌ కో–ఆర్డినేటర్‌ డాక్టర్‌ వంగల శ్రీనివాస్‌ అకాడమీ కౌన్సిల్‌ రిపోర్టును ప్రవేశపెట్టారు. ప్రముఖ వైద్యులు ఎడవల్లి రాజభాస్కర్‌రెడ్డి, శాతవాహన యూనివర్సిటీ నుంచి డాక్టర్‌ సరసిజ, సురేశ్‌, పద్మావతి, డాక్టర్‌ కడారు సురేందర్‌రెడ్డి , వైస్‌ ప్రిన్సిపాల్‌ పి.నితిన్‌, టి.రాజయ్య కౌన్సిల్‌ సభ్యులు రేళ్ల సంజీవ్‌, ఎం.రాజేశ్‌, కిరణ్మయి, రాజేశం, శ్రీనివాసులు, సత్య ప్రకాశ్‌ పాల్గొన్నారు.

రచయితల శాంతి ర్యాలీ

కరీంనగర్‌కల్చరల్‌: ఉగ్రవాదుల దాడికి నిరసనగా తెలంగాణ రచయితల వేదిక ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం శాంతి ర్యాలీ నిర్వహించారు. తెరవే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బూర్ల వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో కవులు, రచయితలు ప్లకార్డులతో నినాదాలు చేశారు. రచయితల వేదిక బాధ్యులు అన్నవరం దేవేందర్‌, సీవీ.కుమార్‌, కందుకూరు అంజయ్య, కుకట్ల తిరుపతి, బుర్ర తిరుపతి, నడిమెట్ల రామయ్య, నసీరుద్దీన్‌, విలాసాగరం రవీందర్‌, పెనుగొండ బసవేశ్వర్‌, కాసనగొట్టి స్వప్న కష్ణ, జనగాని యుగంధర్‌, ఎండీ.ఖాలీద్‌ పాల్గొన్నారు.

చాంపియన్‌ కరీంనగర్‌

కరీంనగర్‌స్పోర్ట్స్‌: తెలంగాణ ఏడో స్టేట్‌లెవల్‌ టాలెంట్‌ హంట్‌ హ్యాండ్‌బాల్‌ బాలుర చాంపియన్‌గా ఉమ్మడి జిల్లా బాలుర జట్టు నిలిచింది. హన్మకొండలో ఈ నెల 24 నుంచి 26 వరకు జరిగిన పోటీల్లో జట్టు చాంపియన్‌షిప్‌ను కై వసం చేసుకుంది.

ఇందిరమ్మ నమూనా ఇల్లు
1
1/3

ఇందిరమ్మ నమూనా ఇల్లు

ఇందిరమ్మ నమూనా ఇల్లు
2
2/3

ఇందిరమ్మ నమూనా ఇల్లు

ఇందిరమ్మ నమూనా ఇల్లు
3
3/3

ఇందిరమ్మ నమూనా ఇల్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement