ఖరీఫ్‌ పంటలను గట్టెక్కిస్తాం | - | Sakshi
Sakshi News home page

ఖరీఫ్‌ పంటలను గట్టెక్కిస్తాం

Aug 21 2026 2:51 AM | Updated on Aug 21 2026 2:51 AM

ఖరీఫ్‌ పంటలను గట్టెక్కిస్తాం

నిజాంసాగర్‌: వర్షాభావం, ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో ఆయకట్టు కింద సాగు చేసిన వానాకాలం పంటలను నిజాంసాగర్‌ జలాలతో గట్టెక్కిస్తామని ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. అలీసాగర్‌ రిజర్వాయర్‌ వరకు అధికారికంగా 1.25 లక్షలు, అనధికారికంగా 1.5 లక్షల ఎకరాల్లో పంటలు సాగు చేస్తున్నారని వెల్లడించారు. ఆయకట్టు కింద సాగు చేస్తున్న పంటలకు నాలుగు విడతల్లో 5 టీఎంసీల నీటి విడుదలకు ప్రభుత్వం సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. గురువారం నిజాంసాగర్‌ ప్రాజెక్టును పోచారం సందర్శించారు. నీటిమట్టం, ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న ఇన్‌ఫ్లో వివరాలను నీటి పారుదలశాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా విలేకరులతో పోచారం మాట్లాడారు. జూన్‌, జూలై నెలల్లో లోటు వర్షపాతం నమోదైందన్నారు. బోరుబావుల వద్ద వరి నారుమ డులు వేసుకున్న బాన్సువాడ, బోధన్‌ నియోజకవర్గాల రైతులు ముందస్తుగానే నాట్లు వేశారన్నారు. దీంతో ప్రాజెక్టు నీటిని అందించి నిజాంసాగర్‌ ఆయకట్టు పంటలను కాపాడాలని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, నీటిపారుదల శాఖ ఈఎన్‌సీ, సీఈని కోరినట్లు చెప్పారు. ఆగస్టు మొదటి వారంలో కురిసిన వర్షాలకు నిజాంసాగర్‌ ప్రాజెక్టులోకి 6 టీఎంసీల మేర వరద నీరు చేరడంతో ఆయకట్టుకు భరోసా కల్గిందన్నారు. ప్రస్తుతం ప్రాజెక్టులో 12 టీఎంసీల నీరు నిల్వ ఉందని ఆయకట్టుకు 5 టీఎంసీలు నాలుగు విడతల్లో ప్రధాన కాలువ ద్వారా అందిస్తామని రైతులకు హామీ ఇచ్చారు. నీటి విడుదలకు అనుమతినిచ్చిన సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు.

సీఎంను కోరా..

ఇటీవల బిచ్కుందకు వచ్చిన సీఎం రేవంత్‌ రెడ్డిని కలిసి సిద్దాపూర్‌ రీడిజైన్‌కు అనుమతించాలని కోరినట్లు పోచారం తెలిపారు. రీడిజైన్‌కు ప్రభుత్వం నుంచి అనుమతి ఇస్తామని సీఎం చెప్పారన్నారు. జాకోరా, చందూర్‌ లిఫ్టుల నిర్మాణ పనులు చేపడుతుండటంతో 10 వేల ఎకరాల ఆయకట్టుకు సాగు నీరు అందనుందని పేర్కొన్నారు. రాష్ట్రంలోనే అత్యధికంగా వరి పంట పండించడంతోపాటు వరిధాన్యం సేకరణలో బాన్సువాడ నియోజకవర్గం మొదటి స్థానంలో ఉందని చెప్పారు. అలాగే నియోజకవర్గంలో 1.45 లక్షల ఎకరాలకు వందకు, వందశాతం సాగునీటి వసతి కల్పిస్తున్న ఘనత ఉందన్నారు. ఆయన వెంట కాంగ్రెస్‌ పార్టీ నిజాంసాగర్‌ మండల అధ్యక్షుడు ప్రజా పండరి, బాన్సువాడ నాయకులు జంగం గంగాధర్‌, ఎజాజ్‌, కృష్ణారెడ్డి, మోహన్‌నాయక్‌, కమ్రు, నార్ల రవీందర్‌, రఘు, రాజేశ్వర్‌గౌడ్‌, శంకర్‌గౌడ్‌, గడ్డం సాయాగౌడ్‌, మన్నె చిన్నసాయిలు, నీటి పారుదల శాఖ డిప్యూటీ ఈఈ ప్రవీణ్‌ కుమార్‌, ఏఈలు సాకేత్‌, అక్షయ్‌, వర్క్‌ ఇన్‌స్పెక్టర్‌ కాశీనాథ్‌ తదితరులున్నారు.

అలీసాగర్‌ వరకు 1.5 లక్షల

ఎకరాలకు సాగు నీరు అందిస్తాం

సిద్దాపూర్‌ రీడిజైన్‌కు సీఎం సానుకూలం

ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు

పోచారం శ్రీనివాస్‌రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement